'డైనమో జాగ్రెబ్‌' జట్టులో తెలంగణ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌

by Disha Web Desk 13 |
డైనమో జాగ్రెబ్‌ జట్టులో తెలంగణ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ యువ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గుగులోత్‌ సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. క్రొయేషియాకు చెందిన ప్రతిష్టాత్మక క్లబ్‌ 'డైనమో జాగ్రెబ్‌'తో ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. సౌమ్యతో పాటు మరో భారత ప్లేయర్‌ జ్యోతి చౌహాన్‌కూ ఈ అవకాశం దక్కింది. దేశం తరఫున డైనమో జాగ్రెబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి ప్లేయర్లు వీళ్లే కావడం విశేషం. ఇంత గొప్ప అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను. డైనమో లాంటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నా వరకు వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని గుగులోత్‌ సౌమ్య పేర్కొన్నారు.

Also Read :కొత్త అవతారంలో రోహిత్‌ శర్మ

Next Story

Most Viewed